*నేటి నుంచి మే 9 వరకు పరీక్షలు ..
* మొత్తం హాజరు కానున్న 6,22,537 మంది విద్యార్ధులు
*విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
*ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష
*రాష్ట్రవ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు.. వీరిలో 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు.
పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.
విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయితే సహేతుక కారణాలతో లేటుగా వస్తే అనుమతించాలని నిర్ణయించారు.
పరీక్షల్లో ఎలాంటి చూచిరాతలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా 156 ఫ్లైయింగ్, 292 సిట్టింగ్ స్క్వాడ్స్ను అధికారులు రంగంలోకి దింపారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఏడు పేపర్లు మాత్రమే పరీక్షలు రాయనున్నారు.
కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నందున పూర్వపు 13 జిల్లాల విద్యాధికారులే కొత్త జిల్లాలకూ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
నేను ఎవరి పల్లికీ మోయడానికి రాలేదు..ప్రజలను పల్లికీ ఎక్కించడానికే వచ్చాను..