telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా కారణంగా ఏపీ సచివాలయంలో మరొకరు మృతి…

AP Secretariate

దేశంలోనే కాకుండా ఏపీలో కూడా కరోనా కేసులు భారీగానే వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏపీ సచివాలయంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్నాయి. దాంతో కరోనాకు ఉద్యోగులు వణికిపోతున్నారు. కరోనాతో సచివాలయంలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు మృతి చెందగా.. తాజాగా మరో ఉద్యోగి కరోనాతో ప్రాణాలు వదిలారు. కార్మికశాఖలో సెక్షన్ అధికారి (ఎస్ఓ) శరత్ చంద్ర నిన్న రాత్రి మరణించారు. కొద్దీ రోజుల క్రితమే కరోనా బారిన పడిన ఆయన విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువ ఉంది. కొందరు చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే తమకు వర్క్ ఫ్రొం హోమ్ ఇవ్వాలని ఇదివరకే ఉద్యోగులు సీఎంకి వినతి పత్రం అందించారు. చూడాలి మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయం పైన స్పందిస్తుందా.. లేదా అనేది.

Related posts