ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ రోజు స్వగృహానికి చేరుకున్న చింతమనేనిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చింతమనేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ఏలూరు ఎక్సైజ్ కోర్టులో చింతమనేనిని పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చింతమనేనిని ఏలూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 25 వరకూ ఆయన రిమాండ్ లో వుంటారు.
బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహ: సోము వీర్రాజు