తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు శనివారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ ఎన్నికల్లో నిర్మాత సి. కల్యాణ్ సార్ధ్యంలోని “మన ప్యానెల్ ” విజయం విజయం సాధిచింది. అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి ఏషియన్ ఫిల్మ్స్ అధినేత నారాయణదాస్ కె. నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వెంకటరమణారెడ్డి(దిల్రాజు), ముత్యాల రాందాస్, కొల్లి రామకృష్ణ ఎంపికయ్యారు.
ప్రధాన కార్యదర్శులుగా కె.ఎల్. దామోదరప్రసాద్, ముత్యాల రమేష్లు గెలుపొందారు. సంయుక్త కార్యదర్శులుగా భరత్ చౌదరి, నట్టికుమార్, వీర నారాయణబాబు, జె. మోహన్రెడ్డి, పి. భరత్భూషణ్, ఎన్. నాగార్జున, కోశాధికారిగా ఎం. విజయేందర్రెడ్డిలను ఎన్నుకున్నారు. ప్రొడ్యూసర్ సెక్టార్కు ఏలూరు సురేందర్రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్కు వెంకట్ అభిషేక్, స్టూడియో సెక్టార్కు వై.సుప్రియ, ఎగ్జిబిటర్ సెక్టార్కు టీఎస్ రాంప్రసాద్ లు ఛైర్మన్లుగా వ్యవహరిస్తారు.