భోజనంలో పిన్నుసూది మింగి ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. సేడం తాలూకా హయాళ్ గ్రామానికి చెందిన 8 ఏళ్ళ బాలిక స్వప్న ఈనెల 22న భోజనం చేస్తుండగా… పొరపాటున పిన్నుసూది మింగేసింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ప్రాథమిక చికిత్సలు అందించి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న స్వప్న ఆదివారం మృతి చెందినట్లు తెలుస్తోంది.
previous post