తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సికింద్రాబాద్ యశోదా హాస్పటల్లో చేర్పించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. అయితే ఇటీవల సమస్య తీవ్రం కావడంతో ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్ యశోద దవాఖానలో వేణు మాధవ్ చేరారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబసభ్యులు మంగళవారం తిరిగి దవాఖానలో చేర్పించారు. కాలేయ సమస్యతోపాటు కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వేణు మాధవ్కి చికిత్స జరుగుతుండగా, సోషల్ మీడియాలో మాత్రం ఆయన చనిపోయాడంటూ నివాళులు అర్పిస్తున్నారు. గతంలోను వేణు మాధవ్ బతికి ఉండగానే ఆయన చనిపోయినట్టు ప్రచారం చేశారు. ఆ సమయంలో వేణు మాధవ్ మీడియా ముందుకు వచ్చి మరీ, తను బతికే ఉన్నానని కన్ఫాం చేశారు. డాక్టర్స్ ప్రకటించే వరకు వేణుమాధవ్ మృతిపై ఎవరు తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
next post