తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇద్దరు టీవీ నటులకు కరోనా పాజిటివ్ రావడం బుల్లితెర వర్గాలను ఓ కుదుపు కుదిపేసింది. ఆ తర్వాత యాంకర్ ఓంకార్ కూడా కరోనా బారిన పడ్డారని విన్నాం కానీ అది నిజం కాదని తెలిసింది. ఇక మరో సీరియల్ నటి (ఆమెకథ ఫేమ్) నవ్య స్వామికి కూడా కరోనా సోకిందంటూ గత రెండు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నప్పటికీ క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఇట్టి వార్తలపై స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో ద్వారా తనకు కరోనా సోకిన మాట వాస్తవమే అని చెప్పేసింది నటి నవ్య స్వామి. గత మూడు, నాలుగు రోజులుగా తలనొప్పి, అలసట ఉండటంతో కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలిందని ఆమె తెలిపింది. అయితే ఈ విషయాన్ని చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన, భయపడాల్సిన పని లేదని ఆమె పేర్కొంది. ప్రస్తుతం పౌష్టికాహారం తీసుకుంటూ సెల్ఫ్ ఇసోలేషన్లో (ఎవ్వరినీ కలవకుండా) విడిగా ఉంటున్నానని, అంతకుముందు తనతో కాంటాక్ట్ అయిన వారు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే కోవిడ్-19 టెస్ట్ చేయించుకోండని నవ్య స్వామి చెప్పింది.
Noted Telugu Television actress Navya Swamy who has tested positive for Covid19 has urged people to take precautions and stay away from negative.
She says there is nothing to fear even if you test COVID19 positive. pic.twitter.com/EUQfYjzrva
— Vamsi Shekar (@UrsVamsiShekar) July 2, 2020