తెలంగాణ ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతామని వస్తే తీసుకోబోమని చెప్పడం దురదృష్టకరమన్నారు. నేడు విధుల్లో చేరబోతున్న కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు నిన్న సమ్మెను స్వచ్ఛందంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ భవితవ్యం, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిన్న ప్రకటించారు. దీంతో 50 రోజులకుపైగా సాగిన సమ్మెకు తెరపడింది. షిఫ్టులతో సంబంధం లేకుండా ఉదయం ఆరు గంటలకే కార్మికులు విధులకు వెళ్లాలని సూచించారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఎండీ స్పష్టమైన ప్రకటన చేశారు.