పది ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాకార్యదర్శి జనార్దన రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 92.43శాతం ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైంది. ఈ ఫలితాలలో కూడా బాలికలదే పైచేయి కావడం విశేషం. బాలురు 91.18 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాలలో అగ్రస్థానంలో జగిత్యాల 99.73 శాతంతో ఉండగా, హైదరాబాద్ 83 శాతం తో చివరి స్థానంలో ఉంది. సప్లిమెంటరీ జూన్ 10 నుండి జరుగనున్నాయి.