తెలుగు రాష్ట్రాలలో టీడీపీ నుండి బీజేపీ లోకి భారీగా వలసలు చోటుచేసుకుంటున్నాయి. నేడు కూడా తెలంగాణ తెదేపా నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, చాడ సురేశ్రెడ్డి, బోడ జనార్దన్ భారతీయ జనతా పార్టీ గూటికి చేరనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమక్షంలో దిల్లీలో గురువారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.
వారితోపాటు మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత శశిధర్రెడ్డి కూడా భాజపాలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నలుగురు చేరిక నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. తెదేపాకు చెందిన కొన్ని జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతల చేరికలు హైదరాబాద్లో జులై రెండోవారంలో ఉండనున్నట్లు సమాచారం.