తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడగించినట్లు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడగిస్తూ బుధవారం ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కోఆపరేటివ్, గురుకులాలు, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల గడువు నిన్నటితో ముగిసింది.
అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభమవ్వడంతో విద్యార్ధులు కాలేజీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు చేపట్టాలని జలీల్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కోరారు.
మాకు ప్రతిపక్షం..స్వపక్షం ఏమీ ఉండవు..మాకు అంతా సమానమే..