telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదు: ఆశ్వత్థామరెడ్డి

ashwathama reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. సమ్మె చేస్తున్న కార్మికులు మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని, కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు.ఆర్టీసీలోనూ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులను కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. 5100 రూట్లకు అనుమతులు ఇస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ డిమాండ్లను కేసీఆర్ అంగీకరిస్తే యూనియన్లు ఉండవని ఆయన చెప్పారు.

Related posts