telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

రాజస్థాన్ లో .. తెలంగాణ పోలీసులకు సన్మానం.. చితకొట్టేశారు..

telangana police attacked by rajastan locals

తెలంగాణాలో చోరీలకు పాల్పడిన నిందితులు రాజస్థాన్ లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లిన తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి దిగడంతో, పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే, వరంగల్‌ సుబేదార్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన ఏఎస్‌ఐ శివకుమార్ సహా ముగ్గురు బేల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు.

నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించగా, అక్కడే ఉన్న స్థానికులు, ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు, వీరిని బేల్వాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. హెర్నియ స్థానికులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, పోలీసులపై దాడికి దిగిన వారిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.

Related posts