telugu navyamedia
Uncategorized తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి:మంత్రి నిరంజన్‌రెడ్డి

niranjanreddy minister

తెలంగాణ రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి పెరిగిందని పౌరసరఫరాల, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిపామని తెలిపారు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా జిల్లాల కలెక్టర్ల, జాయింట్ కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగామని తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో విజయవంతంగా ధాన్య సేకరణ పూర్తి చేశామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు.

Related posts