telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఘ‌నంగా టీఆర్‌ఎస్‌ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ..

తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చి రేపటితో 74 ఏళ్లు పూర్తి అవుతోంది. 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాదిపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగా నేటి నేటి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్నారు..ఎన్టీఆర్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీ సభ నిర్వహించనుంది

ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో… భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలను ఇందులో భాగస్వామ్యం చేశారు.

చారిత్రక సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రేపు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు.రేపు ఎన్టీఆర్ గార్డెన్‌లో వేడుకలు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మ‌రోవైపు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా… సికింద్రాబాద్‌లో ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు.

ఈ ర్యాలీలో స్టూడెంట్స్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్‌ సర్కిల్‌ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది.

అటు అమీర్‌పేటలోని కనకదుర్గమ్మ దేవాలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు నిర్వహించిన మరో ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ ఏడాది మొత్తం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

Related posts