తెలంగాణ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్ వేదికగా ప్రారంభమైంది. మంత్రివర్గ విస్తరణలో పది మంది ఎమ్మెల్యెల చేత గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా నిర్మల్ ఎమ్మెల్యె ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, జగదీష్రెడ్డి, సింగిరెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్,సీహెచ్ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నారు.
ప్రమాణస్వీకారం తరువాత సీఎం కేసీఆర్ కు కొత్త మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మంత్రులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహముద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.