telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రూపాయికే నల్లా కనెక్షన్‌.. దసరా వరకు అందరికీ తాగునీరు..

ktr telangana

వేములవాడ పట్టణ ప్రగతిలో రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, మిషన్ భగీరథ లైన్ 60 శాతం పూర్తి అయింద‌ని పేర్కొన్న కేటీఆర్.. దసరా లోపు వేములవాడ పట్టణంలో ఉన్న 14 వేల కుటుంబాలకు నల్లా నీరు అందిస్తాం అని చెప్పారు. ఒక్క రూపాయి చెల్లించి న‌ల్లా క‌నెక్ష‌న్ తీసుకోవ‌చ్చని అన్నారు. రైతుబజార్‌ నిర్మాణానికి 5 కోట్లు , 100 పడకల హాస్పిటల్ కి 40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్ మంజూరు చేశామని అన్నారు. వేముల‌వాడ ప‌ట్ట‌ణం ద‌క్షిణ కాశీగా పేరు గాంచిందని.. రాజ‌న్న ఆల‌యానికి రోజు వేలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారన్నారు. ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాన్ని ప‌రిశుభ్రంగా ఉంచి, ఆద‌ర్శంగా నిల‌వాలని చెప్పారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంక‌ర కుప్ప‌ల‌ను తొల‌గించాల‌న్నారు. ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధుల‌ను అరిక‌ట్టొచ్చని అన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామ‌న్నారు. వేములవాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తామ‌ని చెప్పారు.

Related posts