కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలు మాస్క్ లు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చాలా మందిలో ‘కరోనా’ సోకినప్పటికీ వారిలో వ్యాధి లక్షణాలు కనబడటం లేదని తెలిపింది.
అందుకే, ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వస్తే మాస్క్ లు ధరించాలని సూచించింది. జపాన్ లో మాస్క్ లు వినియోగించడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను తగ్గించుకోగలిగారని గుర్తుచేసింది. రెండు పొరలుగా ఉండే కాటన్ తో చేసిన మాస్క్ ల వినియోగం ఆమోద యోగ్యమని వివరించింది.
ఉద్యమ నాయకుడు సీఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని