తెలంగాణలో ఆందోళన బాట పట్టిన జూనియర్ వైద్యులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో శనివారం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపును నిరసిస్తూ జూడాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు వైద్యుల నియామకాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. తమ డిమాండ్లకు సానుకూలంగా మంత్రి స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్టు జూడాలు ప్రకటించారు.