హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద రెండో రోజూ ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థులు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. రీ-వెరిఫీకేషన్ కోసం అప్లై చేసుకుందామంటే వెబ్సైట్ ఓపెన్ కావడంలేదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు న్యాయం చేయాలంటూ అక్కడకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు పోలీసులను ఎ ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ఏజెన్సీకి పరీక్షల బాధ్యతలు అప్పగించి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు.
తెలంగాణలో దళితులకు రక్షణ లేదు: మందకృష్ణ