telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ బోర్డు వద్ద రెండో రోజూ ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు!

Telangana Inter board Police force

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్‌ బోర్డు వద్ద రెండో రోజూ ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థులు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. రీ-వెరిఫీకేషన్ కోసం అప్లై చేసుకుందామంటే వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు న్యాయం చేయాలంటూ అక్కడకు చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు పోలీసులను ఎ ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ఏజెన్సీకి పరీక్షల బాధ్యతలు అప్పగించి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు.

Related posts