మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సామాన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పాత్రలో కనిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ముందు బయోపిక్ అని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా ఎవరి జీవితంపై తెరకెక్కింది కాదని సైరా చిత్ర యూనిట్ ప్రకటించడంతో తమిళనాడుకు చెందిన తెలుగు సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిఈ సినిమా విడుదల చేయోద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై హైకోర్టు స్పందించి సినిమా చూడాలా లేదా అనే విషయం ప్రజలపై ఆధారపడి ఉంది. రిలీజ్కు ఒక రోజు ముందు ఈ సినిమాను ఆపలేమని స్పష్టం చేశారు.
previous post
next post