telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రూప్-2 జాబితాపై తెలంగాణ హైకోర్టు స్టే

high court on new building in telangana

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( టీఎస్ పీఎస్ సీ) నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు సంబంధించి విడుదలైన ఫైనల్ ప్రొవిజనల్ ఫలితాల జాబితాపై హైకోర్టు స్టే జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని టీఎస్ పీఎస్ సీకి ఆదేశాలు జారీ చేసింది.

గ్రూప్-2 కేసులో గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ టీఎస్ పీఎస్ సీ వ్యవహరించిందని గ్రూప్-2 అభ్యర్థులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. వైట్ నర్, ట్యాంపరింగ్, క్రాచింగ్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేయవద్దని పిటిషన్లో కోరారు. కాగా, 2016 లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు పరీక్ష నిర్వహణ నిబంధనలపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీర్ఘ కాలంగా కోర్టులో విచారణ జరిగింది.

Related posts