telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చం పంపిన గవర్నర్ తమిళిసై..

సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్‌ పుష్పగుచ్ఛం, లేఖ పంపించారు. సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని  ప్రార్థిస్తున్నట్లు గవర్నర్‌ లేఖలో తెలిపారు.

స్వ‌ల్ప అనారోగ్య సమస్యలతో సీఎం ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానని తమిళిసై అన్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్​ చేశారు.

అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నిన్న ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించి డిశ్చార్జ్ చేశారు.

గత కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యమంత్రి vs గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి వుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ కలగజేసుకుంటున్నారని కేసీఆర్ అసంతృప్తి వున్నారు.

ఇదే సమయంలో రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ హాజరుకాకపోవడం, తర్వాత మేడారం పర్యటన సందర్భంగా గవర్నర్‌ను మంత్రులు పట్టించుకోకపోవడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం పంపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

Related posts