తెలంగాణ గవర్నర్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నరసింహన్ ఇటీవల తన భార్య విమలతో కలిసి బీహార్ రాష్ట్రంలోని గయ పర్యటనకు వెళ్లారు. బీహార్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఉదయం వాంతులతో బాధపడ్డారు. ఉన్నట్టుండి వాంతులు కావడంతో ఆయనను వెంటనే గయలోని మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా రక్త పరీక్ష, ఈసీజీ నిర్వహించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాసేపటికి కోలుకున్న నరసింహన్ తన అర్ధాంగి విమలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్ చేరకునే అవకాశం ఉంది.
previous post
next post