తెలంగాణ లోని పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ కాళీ లను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 వేల పైచిలుకు కానిస్టేబుళ్ల పోస్టుల కు మరియు 625 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ రానున్నది. ఈ మేరకు పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖకు నివేదిక పంపారు డీజీపీ మహేందర్ రెడ్డి. డీజీపీ నివేదికను పరిశీలించి ఆర్థికశాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
previous post
బెంగాల్ లో హింస రాజ్యమేలుతోంది: మోదీ