తెలంగాణ వైద్యులు, కోల్కత్తాలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనకు మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓపి సేవలను నిలిపివేసి నిరసన చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు అత్యవసర సేవల మినహా ఓపి సేవలను బహిష్కరించారు. ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
ఉస్మానియాకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సేవలందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండ్ నాగేందర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది.