telugu navyamedia
Uncategorized

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2,137 కేసులు నమోదు

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న కొత్తగా 2,137 కేసులు నమోదైనాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితం బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 8 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తాజా కేసులు, మరణాలతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,71,306 కేసులు, 1033 మరణాలు నమోదయ్యాయి.

నిన్న ఒక్క రోజే 53,811 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల సంఖ్య 24,88,220కి పెరిగింది. కరోనా కోరల నుంచి నిన్న 2,192 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,39,700కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 30,573 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 24,019 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. 

Related posts