telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభణ… భారీగా పెరిగిన కేసులు !

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 204 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 170 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,522 కు చేరగా.. రికవరీ కేసులు 2,97,851 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,656 మంది మృతిచెందారు.. రికవరీ రేటు దేశంలో 96.6 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.78 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 2015 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 624 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. ఇక, నిన్న ఒకే రోజు 60,263 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 92,99,245కు చేరుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Related posts