రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి పోలీసు కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తం 17 వేల 156 పోస్టులకు గాను..13 వేల 373 మంది పురుషులు, 2 వేల 652 మంది మహిళలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. రాత పరీక్షల్లో 90 వేల మంది అభ్యర్థులు ఇప్పటికే అర్హత సాధించారు. సివిల్, ఏఆర్, టీఎస్ ఎస్పీ, ఫైర్, ప్రిజన్స్, డ్రైవర్స్ తదితర విభాగాల ఫలితాలకు కలిపి ఎంపికయ్యారని టీఎస్ఎల్ పీఆర్బీ వెల్లడించింది.
అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు ఉంటే..సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్థానిక ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. వేయి, ఇతరులు రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. గత సంవత్సరం స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం రాత పరీక్ష, దేహధారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం అప్పటి నుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
ఫలితాలకు మరియు ఇతర వివరాలకు : https.//www.tslprb.in/ వెబ్ సైట్ చూడవచ్చు.
చిరంజీవి, మహేష్ బాబు ఇప్పుడేమయ్యారు ?… జర్నలిస్ట్ శ్వేతారెడ్డి సంచలన వ్యాఖ్యలు