తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు అంజన్కుమార్ యాదవ్, జనారెడ్డిలతో పాటు ఇతర నాయకులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు వినతిపత్రం ఇచ్చేందుకు గాంధీభవన్ నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీభవన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయితే 11 మంది కాంగ్రెస్ నేతలకు మాత్రం గవర్నర్ను కలిసేందుకు అనుమతిచ్చారు.