telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యాదాద్రి ఆలయంలో కేసీఆర్‌ ప్రత్రేక పూజలు

kcr yadaadri

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు  పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్రేక పూజలు నిర్వహించారు. అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థం అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ప్రధానాలయంలో పునర్నిర్మాణ పనులతో పాటు కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్.. యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించనున్నారు.

Related posts