టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ నీచంగా మాట్లాడేవారికే చంద్రబాబు లాంటి ఆలోచనలు వస్తాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక విషయాల్లో ఇబ్బందులు పడ్డామని తెలిపారు.
గతంలో చంద్రబాబు బాబ్లీ మీద గొడవపెట్టుకుని ఏమి సాధించలేదన్నారు. పరవాడ ప్రాజెక్టులతో గొడవపెట్టుకున్న చంద్రబాబు సాధించింది సున్నానని సీఎం ఎద్దేవా చేశారు. ఎక్కడ ప్రాజెక్టు కట్టినా గొడవ చేసి హంగామా క్రియేట్ చేశారన్నారు. కొన్ని కారణాల వల్ల, గత పాలకుల తెలివితక్కువ విధానాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. మహారాష్ట్రతో మాట్లాడి కాళేశ్వరాన్ని పూర్తిచేసుకున్నామని పేర్కొన్నారు. కొంతమంది తెలివిలేని సన్నాసులు రాష్ట్రానికి ఏమీ చేయలేదని కేసీఆర్ విమర్శించారు.
మంగళగిరిలో తనకు సరైన పోటీ లోకేష్ కాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే