విభజన సమస్యలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇందులో సాగునీటిపారుదల, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థలు, ఢిల్లీలోని ఏపీభవన్ విభజన, విద్యుత్ సమస్య, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పై చర్చించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన కీలక శాఖల అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు కూడా హాజరయ్యారు.