telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : తహసీల్దార్‌ హత్య నేపథ్యంలో రాష్ట్ర బంద్ .. కేసీఆర్ బాద్యుడు..

telangana band today on

రాష్ట్రంలో తహసీల్దార్‌ విజయా రెడ్డి హత్య నేపథ్యంలో రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. హత్య వార్త తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనలు వ్యక్తం చేశారు. మానవ హారాలు, కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు.

విజయా రెడ్డి సజీవ దహనాన్ని నిరసిస్తూ మంగళవారం నుంచి మూడు రోజులపాటు విధులు బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ను ప్రకటించారు. విజయారెడ్డి సజీవ దహనాన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. ప్రజలకు రక్షణ కల్పించే ఓ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ర్టేట్‌పై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టమని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Related posts