తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియమితులవడంతో ఆయన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆరుగురు మహిళలు ప్రమాణస్వీకారం చేశారు.
ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖానాయక్(టీఆర్ఎస్), డి.అనసూయ(సీతక్క)(కాంగ్రెస్), గొంగిడి సునీత(టీఆర్ఎస్), హరిప్రియ బానోతు(కాంగ్రెస్), పద్మా దేవేందర్ రెడ్డి(టీఆర్ఎస్), సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్) వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఇంగ్లీష్లో ప్రమాణస్వీకారం చేయగా.. మిగతా నలుగురు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.
ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి