telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో  రెండు నెలలు ఆంక్షలు

Gurukulam entrance exam notification released
భద్రతా చర్యల్లో భాగంగా అసెంబ్లీ పరిసరాల్లో రెండు నెలల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌  తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు మార్చి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడి ఉండడం నిషేధమన్నారు. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టడం, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించడం చేయరాదని సూచించారు. ఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు, లాఠీలు, కత్తులు, స్టిక్‌లు, బ్యాట్‌లు తీసుకుని తిరగడం, లాంటి చర్యలను నిషేధిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులకు ఈ  వర్తించవని వివరించారు.

Related posts