తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 19వ తేదీ మార్చి 2020 నుంచి 06వ తేదీ ఏప్రిల్ 2020 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.