telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సామాజిక

స్నానానికి వెళ్లిన కూతురు… అక్కడ ఏం జరిగిందంటే…!?

Teenage girl

ఇరవై ఏళ్ళ ఓ అందమైన అమ్మాయి స్నానానికి వెళ్తున్నట్టుగా తల్లికి చెప్పింది. తల్లి కూడా సరేనంటూ హడావుడిగా తన నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఉదయాన్నే వచ్చిన 48 ఏళ్ళ ఆ తల్లి ఒక్సానాకు తన కూతురు కన్పించలేదు. అనస్తేసియా అని తన కూతురును పిలుస్తూ ఇల్లు మొత్తం వెతికింది. బాత్రూమ్ లో లైటు వేసి ఉండడం గమనించిన ఆ తల్లి… కూతురు బాత్రూములోనే నిద్రపోతుందా ? ఏంటి అనే అనుమానంతో బాత్రూం తలుపు తెరిచింది. అక్కడ ఖాళీ బాత్ టబ్ లో కళ్ళు మూసుకుని ఉన్న కూతురు కన్పించింది. పైగా ఆమె చేతిలో ఫోన్ కూడా ఉంది. ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి ఉంది. ముందుగా ఛార్జర్ స్విచ్ ఆఫ్ చేసింది తల్లి. అయితే కూతురు ఇంకా లేవకపోవడంతో షాక్ కొట్టడం వల్ల ఆమె స్పృహ కోల్పోయిందేమో అని భావించిన తల్లి వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అప్పటికే అనస్తేసియా మరణించినట్లు నిర్ధారించారు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో ఫోన్ బాత్రూములోనే ఛార్జింగ్ పెట్టడం, ఆ తరువాత ఫోన్ నీళ్ళల్లో పడడమే ఆమె చావుకు కారణమని తేల్చారు. తన 20 ఏళ్ల కూతురు ఇలా చనిపోవడంతో ఆ తల్లి విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అందుకే స్నానానికి వెళ్ళేటప్పుడు ఫోన్ మాత్రం తీసుకెళ్ళకండి.

Related posts