telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చెల్లెలు కోసం ప్రాణాలు పణంగా పెట్టిన 15 ఏళ్ళ బాలుడు… ఏం జరిగిందంటే ?

అమెరికాలో 15 ఏళ్ల బాలుడు తన చెల్లెల ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత గురువారం పోర్ట్ షార్లెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో కైలర్ ఎడ్మన్ (15), ఐదేళ్ల వయసు గల అతడి చెల్లెలు మాత్రమే ఉన్నారు. దొంగను గమనించిన కైలర్ వెంటనే అతడిపై దాడికి దిగాడు. నిద్రపోతున్న చెల్లెలిపై దాడి చేస్తాడేమోనని భయపడి దొంగను ఆపడానికి ప్రయత్నించాడు. పొరుగింటి వ్యక్తి కైలర్ ఇంట్లో అరుపులు విని వచ్చి చూడగా.. కైలర్ చనిపోయి ఉన్నాడు. దీంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఆ సమయానికే దొంగ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కొద్ది గంటల్లోనే పోలీసులు దొంగతనానికి పాల్పడింది ర్యాన్ క్లేటన్ (27) అనే వ్యక్తి అని తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాన్ ఒంటిపై అనేక గాయాలున్నాయని.. కైలర్ తన చెల్లెల్ని రక్షించే సమయంలో దొంగపై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. కైలర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి.. ర్యాన్‌పై హత్య, దొంగతనం కేసులను నమోదు చేశారు. కైలర్ హత్యకు గల కారణాలను తెలుసుకున్నాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Related posts