telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సాంకేతిక లోపంతో నిలిచిన రైలు.. ప్రయాణీకుల ఇబ్బందులు

Attack Railway TTI in Danapur express

మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద కాచిగూడ – అకోలా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైల్వే అధికారులు నిలిపివేశారు. ఈ రైలులో ఎక్కువగా ఉద్యోగులు, దినసరి కూలీలు ప్రయాణిస్తూ ఉంటారు. సుమారు గంటన్నరపాటు రైలు పట్టాలపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. రైలు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని ఇంజిన్‌కు మరమ్మతులు చేస్తున్నారు.

Related posts