ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ 44.1 ఓవర్లకు 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 5 వన్డేల సిరీస్ భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ బౌలర్లలో చాహల్ 3, పాండ్యా 2, షమీ 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ గెలుపుతో 4-1తో సిరీస్ నెగ్గి 52 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. 1967 నుంచి కివీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ విజయాన్ని (2008-09 పర్యటనలో) అందుకుంది. తాజాగా 4-1తో అతిపెద్ద సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుని చరిత్రను సృష్టించింది.