telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

చివరి వన్డేలో భారత్‌ ఘనవిజయం.. 4-1 తేడాతో సిరీస్‌ కైవసం

Team India won by New Zealand

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌ లో న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్‌ 44.1 ఓవర్లకు 217 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో 5 వన్డేల సిరీస్‌ భారత్‌ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్‌ బౌలర్లలో చాహల్‌ 3, పాండ్యా 2, షమీ 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ గెలుపుతో 4-1తో సిరీస్‌ నెగ్గి 52 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. 1967 నుంచి కివీస్‌ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్‌ విజయాన్ని (2008-09 పర్యటనలో) అందుకుంది. తాజాగా 4-1తో అతిపెద్ద సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుని చరిత్రను సృష్టించింది.

Related posts