ప్రపంచకప్ అనంతరం భారత్ జట్టు రెండు వన్డే మ్యాచులు మాత్రమే ఆడినప్పటికీ ర్యాంకింగ్స్లో మాత్రం క్రికెటర్ల జోరు తగ్గలేదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. పంచకప్లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ 863 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 797 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. భారత్ పర్యటలో విఫలమవుతున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ 694 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లోనూ భారత్ జట్టుకి రెండో స్థానం దక్కింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ 125 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత భారత్ (122), న్యూజిలాండ్ (112), ఆస్ట్రేలియా (111), దక్షిణాఫ్రికా (110) టాప్-5లో నిలిచాయి. శ్రీలంకతో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్ని 2-0తో చేజిక్కించుకున్న పాకిస్థాన్ 98 పాయింట్లతో ఆరో స్థానంలో, శ్రీలంక (79) 8వ స్థానంలో నిలిచింది.