telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. కప్ కొట్టుకొస్తాం.. ఇంగ్లాండ్ బయలుదేరిన టీం ఇండియా..

team india to england shared photos

ఇంగ్లండ్ లో ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న వరల్డ్ కప్ క్రికెట్ కోసం భారత జట్టు బయలుదేరి వెళ్లింది. కోహ్లీ నేతృత్వంలోని ఆటగాళ్ల టీమ్, ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు పయనం కాగా, విమానాశ్రయంలో వీరు దిగిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. గెలుపే లక్ష్యంగా టీమిండియా లండన్ కు బయలుదేరి వెళ్లగా, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాము స్వయంగా తీసుకున్న చిత్రాలను రోహిత్ శర్మ, బుమ్రా, పాండ్యా తదితరులు కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ నెల 30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా, జూన్ 5న సౌతాఫ్రికాతో ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా తమకు కీలకమేనని, తొలి మ్యాచ్ నుంచే టాప్ గేర్ లో వెళతామని కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

Related posts