telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ : .. నెమ్మదిగా నిలదొక్కుకుంటున్న .. భారత్..

team india playing steadily with westindies

వెస్టిండీస్‌ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి భారత్‌ 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (37, 73 బంతుల్లో 4X4), అజింక్య రహానె (10; 43బంతుల్లో 2X4) ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరూ 43 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దుతున్నారు.

అంతకుముందు కెప్టెన్‌ కోహ్లీ(9), మయాంక్‌ అగర్వాల్‌(5), ఛెతేశ్వర్‌ పుజారా(2)నిరాశ పరిచారు. మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో అరగంట ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ విండీస్‌ బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చలాయిస్తున్నారు.

Related posts