telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు…

భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే.. కోహ్లీ న్యాయకత్వంలోని టీం ఇండియా అక్కడి నుండే ఆసీస్ కు పయనమైంది. ఆ తర్వాత తాజాగా బీసీసీఐ భార్త జట్టు ఆసీస్ కు చేరుకున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత జట్టు మొత్తం మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో డిసెంబర్ 17-21 వరకు జరిగే మొదటి డే-నైట్ టెస్టులో మాత్రమే భారత కెప్టెన్ విరాట్ ఆడనున్నాడు. ఎందుకంటే… ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్. వారు జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో కోహ్లీ తిరిగి భారత్ కు వచ్చేస్తాడు. ఇక కేవలం టెస్ట్ జట్టులో మాత్రమే చోటు సంపాదించుకున్న రోహిత్ శర్మ మాత్రం ఆసీస్ కు వెళ్ళలేదు. గాయం కారణంగానే రోహిత్ కు అన్ని ఫార్మాట్లలో చోటు దక్కలేదు. అయితే యూఏఈ నుండి భారత్ కు వచ్చి ఇక్కడ పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత హిట్ మ్యాన్ వెళ్లి భారత జట్టుతో కలవనున్నాడు. చూడాలి మరి ఈ పర్యటనలో భారత జట్టు ఏం చేస్తుంది అనేది.

Related posts