ప్రపంచ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో అఫ్గానిస్తాన్తో ఉత్కంఠభరితంగ జరిగిన మ్యాచ్లో భారత్ 11 పరుగులతో అతికష్టంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ లో 225 పరుగుల స్వల్ప లక్ష్యంతో దిగిన అఫ్గానిస్తాన్ తుది వరకు పొరాడి ఓ బాల్ ఉండగానే 213 పరుగులకు ఆలౌటైంది. జస్ ప్రీత్ బుమ్ర సమయోచిత బౌలింగ్ తో భారత్ ను రక్షించారు.
చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి ఫోర్ కొట్టి నభీ ఉత్కంఠ పెంచారు. మూడో బాల్ కు నబీ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత రెండు బంతులకు వరుసగా అఫ్తాబ్, ముజీబ్ అవుట్ కావడంతో షమీ హ్యాట్రిక్ తో పాటు ఇండియా విజయం సాధించింది. ఇదిలా ఉండగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు చైనా కంపెనీకి చెందిన ఒప్పో లోగోన్ ధరించగా, ఆఫ్గన్ ఆటగాళ్ళు భారత్ కు చెందిన అమూల్ లోగో ను ధరించడం గమనార్హం.