telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ విషయాలు అసెంబ్లీ స్పీకర్ తెలుసుకోవాలి: యనమల హితవు

Yanamala tdp

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు చేయడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చట్టసభల విషయాల్లో న్యాయస్థానాల జోక్యం ఉండరాదని స్పీకర్ తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఘాటుగా స్పందించారు. ఏదైనా అంశం చట్టవిరుద్ధం అయిన పక్షంలో చట్టసభల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయని తెలిపారు. ఈ విషయాన్ని గౌరవనీయ అసెంబ్లీ స్పీకర్ తెలుసుకోవాలని హితవు పలికారు.

ఓ సభలో ఆమోదం పొందిన చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టు దాన్ని ప్రశ్నించే వీలుందని స్పష్టం చేశారు. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీల వద్ద పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టుకు ఏజీ తెలిపినప్పుడు, ప్రభుత్వం ఆ బిల్లులను మరోసారి సభలోకి ఎలా తీసుకువచ్చిందని యనమల ప్రశ్నించారు. ఇది చట్టవిరుద్ధం కాబట్టే తమ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని వెల్లడించారు. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని, ఈ రెండు బిల్లులకు చెందిన శాసన ప్రక్రియ ఇంకా ముగియలేదని యనమల స్పష్టం చేశారు.

Related posts