ప్రతిపక్షం నిలదీతను తట్టుకోలేకనే సీఎం జగన్ అసెంబ్లీలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశాలు జగన్ అహంభావానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు వైసీపీ చెప్పిన సమాధానాలన్నీ తప్పుల తడకలేనని మండిపడ్డారు. ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని వైసీపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.
దిశ బిల్లు వచ్చిన తర్వాత కూడా ఏపీలో అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని యనమల అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన సొంత సామాజికవర్గం వాళ్లపై చర్యలు లేవా? అని యనమల ప్రశ్నించారు.నిందితులపై చర్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భవనాలకు రంగుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు.