మూడు రాజధానులు కట్టమని ఎవరూ అడగలేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…వైసీపీ నాయకుల స్వార్థంతో రాజధానిని, హైకోర్టును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి సమయంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. అయినప్పటికీ మూడు రాజధానులు అంటూ సొంతంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.
విశాఖపట్నంలో భూ కబ్జాలు మొదలు పెట్టారు.దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న జగన్ను మోదీ పలు అంశాలపై నిలదీసినట్లు తెలిసింది. అసెంబ్లీ నుంచి మండలికి చాలా బిల్లులు వచ్చాయి. అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను మేము అడ్డుకోలేదు. వాటిల్లో రెండింటిని మాత్రమే వెనక్కి పంపాము. సెలెక్ట్ కమిటీకి పంపితే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని యనమల విమర్శించారు.