telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది: యనమల

Yanamala tdp

సీఎం జగన్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తలసరి ఆదాయం రూ.17 వేలకు పడిపోయిందని చెప్పారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికాభిచృద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు.ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రగతి పతనావస్థకు చేరిందని, పెట్టుబడిదారులు ఎవరూ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రాష్ట్రతీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు నీతి అయోగ్‌ నివేదిక సాక్ష్యమని చెప్పారు. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో నిలిచిందని, దక్షిణాదిలో చిట్ట చివరిన ఉందని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

Related posts